Thursday, July 26, 2012

లండన్ ఒలింపిక్స్ లో మన పోటీల షెడ్యూల్....

లండన్,జులై, 26: లండన్ ఒలింపిక్స్ లో మన పోటీల షెడ్యూల్.... 
బ్యాడ్మింటన్
సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్), కశ్యప్ (పురుషుల సింగిల్స్), జ్వాల-అశ్విని (మహిళల డబుల్స్), జ్వాల-దిజు (మిక్స్‌డ్ డబుల్స్).వేదిక: వెంబ్లీ ఎరీనా....తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు......తొలి నాలుగు రోజులపాటు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం ఆగస్టు 1 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. 3వ తేదీన మిక్స్‌డ్ డబుల్స్; 4వ తేదీన మహిళల సింగిల్స్, డబుల్స్; 5వ తేదీన పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్స్ (పతకాల కోసం) జరుగుతాయి.
టేబుల్ టెన్నిస్
సౌమ్యజిత్ ఘోష్ (పురుషుల సింగిల్స్), అంకిత దాస్ (మహిళల సింగిల్స్)....వేదిక: ఎక్సెల్ ఎరీనా.....తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు...
తొలి రోజున ఈ ఇద్దరు భారత క్రీడాకారులు ప్రిలిమినరీ రౌండ్‌లో పోటీపడతారు. ముందంజ వేస్తే తదుపరి రోజుల్లో పోటీపడతారు. ఆగస్టు 1న మహిళల సింగిల్స్లో , ఆగస్టు 2న పురుషుల సింగిల్స్ లో పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి.
హాకీ
భరత్ చెత్రి నాయకత్వంలోని 16 మంది సభ్యులతో భారత్ బరిలోకి దిగనుంది. డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్, సర్దార్ సింగ్, శివేంద్ర సింగ్ కీలక ఆటగాళ్లు......వేదిక: రివర్‌బ్యాంక్ ఎరీనా......తేదీలు: జూలై 29 నుంచి ఆగస్టు 11 వరకు.......గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్  జూలై 30న నెదర్లాండ్స్తో; ఆగస్టు 1న న్యూజిలాండ్‌తో; ఆగస్టు 3న జర్మనీతో; ఆగస్టు 5న దక్షిణ కొరియాతో; ఆగస్టు 7న బెల్జియంతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో గనుక తొలి రెండు స్థానాల్లో నిలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధించి పతకం రేసులో ఉంటుంది. ఆగస్టు 11న స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి. 
జూడో
గరీమా చౌదరీ....వేదిక: ఎక్సెల్ ఎరీనా: తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.....భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ఏకైక జూడో క్రీడాకారిణి గరీమా చౌదరీ 63 కేజీల విభాగంలో జూలై 31న బరిలోకి దిగుతుంది. అదే రోజున క్వాలిఫయింగ్ రౌండ్లతోపాటు ఫైనల్స్ ఉంటాయి.
బాక్సింగ్
పురుషుల విభాగం: దేవేంద్రో సింగ్ (49 కేజీలు), శివ థాపా (56 కేజీలు), జై భగవాన్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు); మహిళల విభాగం: మేరీకామ్ (51 కేజీలు).....వేదిక: ఎక్సెల్ ఎరీనా
తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 12 వరకు......తొలి రోజు నుంచి నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఆగస్టు 5న మహిళల విభాగం బౌట్‌లు ప్రారంభమవుతాయి. 9న మహిళల ఫైనల్స్ జరుగుతాయి. పురుషుల విభాగం ఫైనల్స్ 11, 12 తేదీల్లో జరుగుతాయి.
స్విమ్మింగ్
గగన్ ఉలాల్మత్....వేదిక: అక్వాటిక్ సెంటర్: తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు....భారత్ నుంచి బరిలోకి దిగుతున్న ఏకైక స్విమ్మర్ గగన్ ఉలాల్మత్ ఆగస్టు 3న జరిగే 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో పోటీపడతాడు. ఈ దశ దాటితే ఆగస్టు 4న జరిగే ఫైనల్లో బరిలోకి దిగుతాడు.
ఆర్చరీ
దీపిక కుమారి, బొంబేలా దేవి, చక్రవోలు స్వారో (మహిళల టీమ్, వ్యక్తిగత రికర్వ్), జయంత తాలుక్‌దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్‌దీప్ రాయ్ (పురుషుల టీమ్, వ్యక్తిగత రికర్వ్)......వేదిక: లార్డ్స్ మైదానం; తేదీలు: జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు....తొలి రోజు ర్యాంకింగ్ రౌండ్స్ జరిగాక 28, 29వ తేదీల్లో టీమ్ విభాగాల్లో పతకాల కోసం మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మూడు రోజులపాటు వ్యక్తిగత విభాగాల్లో నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 2, 3వ తేదీల్లో పతకాల కోసం మ్యాచ్‌లు ఉంటాయి.
టెన్నిస్
సోమ్‌దేవ్ (పురుషుల సింగిల్స్), మహేశ్ భూపతి-రోహన్ బోపన్న (పురుషుల డబుల్స్), పేస్-విష్ణువర్ధన్ (పురుషుల డబుల్స్), సానియా-రష్మీ చక్రవర్తి (మహిళల డబుల్స్), పేస్-సానియా (మిక్స్‌డ్ డబుల్స్).......వేదిక: వింబుల్డన్; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు
వారం రోజులపాటు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 4న పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్యాల కోసం... మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం కోసం మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఆగస్టు 5న పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్యాల కోసం... మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ, రజత పతకాల కోసం మ్యాచ్‌లుంటాయి.
అథ్లెటిక్స్
ఓంప్రకాశ్ (షాట్‌పుట్), వికాస్ గౌడ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరీ (ట్రిపుల్ జంప్), గుర్మీత్ సింగ్, బల్జిందర్ సింగ్, ఇర్ఫాన్ (20 కిలోమీటర్ల నడక), బహదూర్ రాణా (50 కిలోమీటర్ల నడక), రామ్‌సింగ్ యాదవ్ (మారథాన్), మయూఖా జానీ (ట్రిపుల్ జంప్), టింటూ లూకా (800 మీటర్లు), కృష్ణ పూనియా, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), సుధా సింగ్ (3000 మీటర్ల స్టీపుల్‌చేజ్), సహనా కుమారి (హైజంప్)........వేదిక: ఒలింపిక్ స్టేడియం; తేదీలు: ఆగస్టు 3 నుంచి 12 వరకు.....పోటీలు జరిగే అన్ని రోజులూ ఫైనల్స్ (పతకాల కోసం) ఉన్నాయి. భారత ఫేవరెట్... కృష్ణ పూనియా ఆగస్టు 3న డిస్కస్ త్రో అర్హత రౌండ్లలో పోటీపడుతుంది. ఫైనల్‌కు చేరుకుంటే ఆగస్టు 4వ తేదీన పత కం రేసులో ఉంటుంది.
షూటింగ్
గగన్ నారంగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), రంజన్ సోధి (డబుల్ ట్రాప్), మానవ్‌జిత్ సంధూ (ట్రాప్), విజయ్ కుమార్ (25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్), సంజీవ్ రాజ్‌పుత్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), జాయ్‌దీప్ కర్మాకర్ (50 మీటర్ల రైఫిల్ ప్రోన్), హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్), రాహీ సర్నోబాత్ (25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్), అన్నూరాజ్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్), షగున్ చౌదరీ (ట్రాప్)......
వేదిక: ది రాయల్ ఆర్టిలరీ బ్యారెక్స్; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 6 వరకు....పోటీలు జరిగే 10 రోజులూ ఫైనల్స్ (పతకాల కోసం) ఉన్నాయి. భారత ఫేవరెట్స్... గగన్ నారంగ్ ఈవెంట్స్ వరుసగా జూలై 30న, ఆగస్టు 3న, ఆగస్టు 6న ఉన్నాయి. అభినవ్ బింద్రా తన స్వర్ణాన్ని నిలబెట్టుకునేందుకు జూలై 30న బరిలోకి దిగుతాడు. రంజన్ సోధి ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్ ఆగస్టు 2న ఉంది.
రోయింగ్
స్వరణ్ సింగ్, మంజిత్ సింగ్, సందీప్ కుమార్.....వేదిక: ఎటాన్ డోర్నీ; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు.....స్వరణ్ సింగ్ జూలై 28న ‘సింగిల్ స్కల్’ ఈవెంట్ హీట్స్‌లో బరిలోకి దిగుతాడు. ఈ దశ తర్వాత మరో మూడు దశలుంటాయి. ఆగస్టు 3న ఫైనల్ ఉంటుంది. మంజిత్, సందీప్ జూలై 28న ‘డబుల్ స్కల్స్’ హీట్స్‌లో పోటీపడతారు. ఆగస్టు 2న ఫైనల్ జరుగుతుంది.
వెయిట్‌లిఫ్టింగ్
సోనియా చాను, కత్తుల రవికుమార్....వేదిక: ఎక్సెల్ ఎరీనా; తేదీలు: జూలై 28 నుంచి ఆగస్టు 7 వరకు.......అన్ని విభాగాలలో అదే రోజున ఫైనల్స్ జరుగుతాయి. సోనియా చాను మహిళల 48 కేజీల విభాగంలో జూలై 28న... రవికుమార్ పురుషుల 69 కేజీల విభాగంలో జూలై 31న పోటీపడతారు.
రెజ్లింగ్
అమిత్ కుమార్ (55 కేజీలు), యోగేశ్వర్ దత్ (60 కేజీలు), సుశీల్ కుమార్ (66 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు), గీతా ఫోగట్ (మహిళల 55 కేజీలు)....వేదిక: ఎక్సెల్ ఎరీనా......తేదీలు: ఆగస్టు 5 నుంచి 12 వరకు......
తొలి మూడు రోజులు గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు జరుగుతాయి. అదే రోజున పతకాల కోసం బౌట్స్ ఉంటాయి. ఆ తర్వాత రెండు రోజులు మహిళల విభాగంలో బౌట్‌లుంటాయి. ఆగస్టు 9న గీత బరిలోకి దిగుతుంది. భారత రెజ్లర్లు పోటీపడే ఫ్రీస్టయిల్ ఈవెంట్ ఆగస్టు 10 నుంచి 12 వరకు జరుగుతాయి. 10న అమిత్ కుమార్, నర్సింగ్ యాదవ్; 11న యోగేశ్వర్ దత్; 12న సుశీల్ కుమార్ పతకాల కోసం బరిలోకి దిగుతారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...