పంతం నెగ్గించుకున్న యడ్యూరప్ప : కర్ణాటక కొత్త సి.ఎం. జగదీశ్ శెట్టర్‌

జగదీశ్ శెట్టర్‌ను అభినందిస్తున్న సదానంద గౌడ
బెంగళూరు, జులై 8: కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెర  పడింది.  రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సదానంద గౌడను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో మాజీ సీఎం యడ్యూరప్ప సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి జగదీశ్ శెట్టర్‌ను నియమించింది. దీంతో తన వర్గానికి చెందిన తొమ్మిది మంది మంత్రులతో రాజీనామాలు చేయించి, రాజకీయ అలజడి సృష్టించిన యడ్డీ పంతం నెగ్గినట్టయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలలే గడువుండటంతో రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించాలంటే యడ్యూరప్ప నాయకత్వంలో పనిచేయక తప్పదని పార్టీ కేంద్ర నాయకత్వం గుర్తించినట్టు బీజేపీ వర్గాలు చెప్పాయి. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో 2008 నుంచి దినదినగండంగా పాలన సాగిస్తున్న బీజేపీ సర్కారుకు 56 ఏళ్ల శెట్టర్ ముచ్చటగా మూడో సీఎం కావడం విశేషం. కర్ణాటకకు ఆయన 27వ ముఖ్యమంత్రి కానున్నారు. గత 11 నెలల వ్యవధిలో ఆ రాష్ట్రంలో సీఎం మారడం ఇది రెండోసారి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు