కొలంబో, జులై 31: శ్రీలంకపై జరిగిన నాలుగో వన్డేలో విజయం సాధించి భారత్ ఐదు వన్డేల సిరీస్ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ అజేయమైన సెంచరీ, సురేష్ రైనా అర్థ సెంచరీ భారత్కు విజయాన్ని చేకూర్చి పెట్టింది. మొదట్లో భారత్ తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ, సురేష్ రైనాల బ్యాటింగుతో విజయాన్ని దక్కించుకుంది. శ్రీలంక తన ముందు ఉంచిన 252 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. ఓ మ్యాచు మిగిలి ఉండగానే సిరీస్ను భారత్ 3.-1 స్కోరుతో సొంతం చేసుకుంది. ఓపెనర్ గంభీర్ డకవుట్ కాగా, మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (4), తివారీ (21) త్వరగా అవుటైనా విరాట్ కోహ్లీకి సురేష్ రైనా తోడై మరో వికెట్ పడిపోకుండా విజయాన్ని అందించారు. తొలుత ఆచితూచి ఆడిన కోహ్లీ, రైనా తర్వాత రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లు ఈ జోడీని విడగొట్టలేక చేతులెత్తేశారు. విరాట్ కోహ్లీ 128 పరుగులు చేయగా, రైనా 58 పరుగులు చేశాడు. మలింగ, ప్రదీప్, మెండిస్, మాథ్యూస్ తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో తివారి నాలుగు వికెట్లు తీసుకోగా, అశ్విన్ రెండు, సెహ్వాగ్, దిండా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment