Wednesday, July 4, 2012

జట్టులోకి తిరిగి జహీర్‌ఖాన్, సెహ్వాగ్

ఈ నెల 21 నుంచి లంకతో వన్ డే సిరీస్...  
ముంబై,జులై 4: శ్రీలంకతో సిరీస్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టు ఖరారైంది.  జహీర్‌ఖాన్, సెహ్వాగ్, ఉమేశ్ యాదవ్ తిరిగిజట్టులోకి వచ్చారు. భారత్ ఆడిన చివరి టోర్నీ ఆసియాకప్‌కు గాయాల కారణంగా దూరమైన ఈ ముగ్గురూ మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన కనబరచిన అజింక్య రహానేతో పాటు హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు జట్టులో స్థానం లభించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోరడంతో ఎంపిక చేయలేదు.  ఐపీఎల్‌లో పేలవంగా ఆడిన . ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజాలపై వేటు పడింది.  ధోనికి డిప్యూటీగా విరాట్ కోహ్లి కొనసాగుతాడు.  శ్రీలంకతో భారత జట్టు జులై 21 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు వన్డేలు ఆడుతుంది. 7న ఒక టి 20 మ్యాచ్ ఆడుతుంది. జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి (వైస్‌కెప్టెన్), సెహ్వాగ్, గంభీర్, రైనా, రోహిత్ శర్మ, రహానే, మనోజ్ తివారీ, జహీర్, ఉమేశ్, వినయ్, అశోక్ దిండా, అశ్విన్, ఓజా, రాహుల్‌శర్మ.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...