షిర్డీ సంస్థాన్‌కు ఎన్నారై భారీ విరాళం

 షిర్డీ,జులై 3:  : గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా సాయినాథుడు కొలువైన షిర్డీ  సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్  కు  ఓ ప్రవాస భారతీయుడు 33 వేల అమెరికన్ డాలర్ల మొత్తాన్ని (భారత కరెన్సీలో సుమారు 17 లక్షల రూపాయలకు పైనే..) విరాళంగా అందించారు. మరో భక్తుడు 90 గ్రాముల విలువైన హారాన్ని బాబాకు బహుకరించినట్టు  ఆలయ వర్గాలు తెలిపాయి.

Comments