Friday, July 27, 2012

టి.డి.పి. నేత బివి మోహన్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్, జులై 27: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చేరారు.  ఆయన వయస్సు 67. ఆయన 1983 నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 1983-1999 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, టిడిపి ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా విధులు నిర్వర్తించారు. తాజా ఉప ఎన్నికలలో బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నుండి పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్య్రర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధికి బివి మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుత కేంద్రమంత్రి పురంధేశ్వరి, హీరో నందమూరి బాలకృష్ణలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బివి మోహన్ రెడ్డి తన చేతులతో ఆడించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పురంధేశ్వరి పార్టీ పెద్దలు కోరినప్పటికీ ఎమ్మిగనూరుకు మాత్రం వెళ్లలేదు. రాజకీయ జ్యోతిష్యాల్లో దిట్టగా ఆయనకు పేరుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...