కోల్కతా,, జులై 24: ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతోఆయన కుమారుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిజిత్ ముఖర్జీ. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన జాంగీపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ముర్షీదాబాద్ జిల్లాలోని జాంగీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఆకాంక్షను అభిజిత్ వ్యక్తంచేశారని ముర్షీదాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ చౌధురి మంగళవారం చెప్పారు. అభిజిత్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే జాంగీపూర్ పోటీ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదన్నారు. జాంగీపూర్ ఉప ఎన్నికకు ఇంకా తేదీ ఖరారు కాలేదని, ఆ నియోజకవర్గం అభివృద్ధికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేసినందున, అక్కడి నుంచి అభిజిత్ పోటీ చేస్తే విజయం సాధిస్తామని ఆయన అన్నారు. అభిజిత్ ప్రస్తుతం బీర్భుమ్ జిల్లాలోని నల్హతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment