Saturday, July 28, 2012

మూడో వన్డేలో భారత్ విజయం

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనా 
కొలంబో, జులై 28:  ఓపెనర్ గౌతమ్ గంభీర్ (101 బంతుల్లో 102; ఫోర్లు 10) సూపర్ సెంచరీతో  మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. శనివారం ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. చివర్లో సురేశ్ రైనా (45 బంతుల్లో 65 నాటౌట్; ఫోర్లు 6; ఓ సిక్స్), ఇర్ఫాన్ పఠాన్ (31 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్లు 3) ఒత్తిడిని తట్టుకుంటూ సమన్వయంతో ఆడటంతో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 286 పరుగులు సాధించింది. 20 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోగా జట్టును సంగక్కర (95 బంతుల్లో 73; ఫోర్లు 5), జయవర్ధనే (79 బంతుల్లో 65; ఫోర్లు 5), మాథ్యూస్ (57 బంతుల్లో 71; ఫోర్లు 5; ఓ సిక్స్) ఆదుకున్నారు. జహీర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 288/5 పరుగులు చేసి గెలిచింది. రెండో ఓవర్‌లోనే సెహ్వాగ్ (3) వికెట్ కోల్పోయింది. గంభీర్, కోహ్లి (65 బంతుల్లో 38; ఫోర్లు 2) సమయోచితంగా ఆడి లంక బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 105 పరుగులు జత చేరాయి. 39వ ఓవర్‌లో గంభీర్ రనౌట్ అయ్యాడు. చివర్లో రన్‌రేట్ పెరిగినా రైనా, ఇర్ఫాన్ పద్దతిగా  ఆడి మ్యాచ్‌ను ముగించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనా కు దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...