Tuesday, July 24, 2012

శ్రీలక్ష్మిని ' గాలి ' కొదిలేసిన ప్రభుత్వం...

హైదరాబాద్ , జులై 24:  కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోల జారీ విషయంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఎనిమిది ఐఎఎస్ అధికారుల్లో ఏడుగురికి న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏడుగురు ఐఎఎస్ అధికారులకు ప్రభుత్వం న్యాయవాదుల ఫీజులు చెల్లిస్తుంది. ఇదే వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రుల్లో ఐదుగురికి న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. మంత్రుల్లో మోపిదేవి వెంకటరమణను ప్రభుత్వం సహాయం నుంచి మినహాయించింది. న్యాయ సహాయం అందుకునే ఐఎఎస్ అధికారుల్లో శామ్యూల్, రత్నప్రభ, మన్మహన్ సింగ్, ఆదిత్యనాథ్, సివిఎస్‌కె శర్మ, ఎస్వీ ప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, జె. గీతా రెడ్డి ఉన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...