Tuesday, July 31, 2012

మంత్రి పార్థసారథికి ఊరట

హైదరాబాద్, జులై 31: ఫెరా నిబంధనలు ఉల్లఘించిన కేసులో జైలుశిక్ష పడిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి ఊరట లభించింది. జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్షను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించింది. కేపీఆర్ టెలీప్రొడక్ట్స్ ఎండీ హోదాలో ఫారిన్ ఎక్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్టు  (ఫెరా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన రెండు నెలల సాధారణ జైలు శిక్షను సవాల్ చేస్తూ మంత్రి పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును సోమవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...