హైదరాబాద్, జులై 31: ఫెరా నిబంధనలు ఉల్లఘించిన కేసులో జైలుశిక్ష పడిన మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి ఊరట లభించింది. జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మంత్రి పార్థసారధికి రెండు నెలల జైలు శిక్షను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు విధించింది. కేపీఆర్ టెలీప్రొడక్ట్స్ ఎండీ హోదాలో ఫారిన్ ఎక్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్టు (ఫెరా) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విధించిన రెండు నెలల సాధారణ జైలు శిక్షను సవాల్ చేస్తూ మంత్రి పార్థసారథి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును సోమవారం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment