మంత్రుల అవినీతి ఆరోపణలలపై అన్నా బృందం దీక్ష...

న్యూఢిల్లీ, జులై 25: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది కేంద్ర మంత్రులపై విచారణకు ఆదేశించాలంటూ అన్నా హజారే బృందం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో దీక్ష చేపట్టింది.  మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీపై అన్నా బృందం చేస్తోన్న ఆరోపణలపై మండిపడ్డ ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అన్నా బృందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా,  పటిష్ట లోక్‌పాల్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలనే డిమాండ్‌తో హజారే ఈ నెల 29న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రభుత్వం హామీలు మాత్రమే ఇస్తోందని, బిల్లు ఆమోదానికి సంబంధించి ఏ చర్యలు ఆచరణలో కనిపించడంలేదని అన్నా బృందం ఆరోపించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు