Sunday, July 29, 2012

అభినవ సిద్దేంద్ర యోగి అస్తమయం...

చెన్నై,  జులై 28:  కూచిపూడి నాట్యానికి సమున్నత స్థానం  కల్పించిన ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు వెంపటి చినసత్యం  (87)  కన్నుమూశారు. కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి  తమ జీవితమంతా అంకితం చేసిన విదుషీ మణి వెంపటి చినసత్యం 100కి పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. రేఖ, హేమమాలిని, వైజయంతిమాల, ప్రభ తదితర నటీమణులకు ఆయన నాట్యగురువు. 1963లో చెన్నైలోకూచిపూడి ఆర్ట్ పౌండేషన్‌ స్థాపించి కూచిపూడి నాట్యానికి విశేష సేవలందించారు. ఆయన శిష్య పరంపరలో చేరిన వాళ్లలో చాలా మంది విదేశాలలో కూడా, కూచిపూడి నాట్య శిక్షణా సంస్థలని నెలకొల్పి,  నిరంతరాయంగా కూచిపూడి నాట్య కళా ప్రాచుర్యానికి దోహదం చేస్తున్నారు. దేశ, విదేశాలలో అసంఖ్యాకమైన సత్కార, సన్మానాలు, గౌరవ డాక్టరేట్లు సంతరించుకున్న వెంపటి చినసత్యం ను  కూచిపూడి నాట్య కళా ప్రపంచం అభినవ సిద్దేంద్ర యోగిగా భావిస్తుంది.     శ్రీ కృష్ణ పారిజాతం,     మేనకా విశ్వామిత్ర,     రుక్మిణీ కల్యాణం,     కిరాతార్జునీయం,     క్షీరసాగరమధనం,     పద్మావతీ శ్రీనివాసం,     చండాలిక,     హరవిలాసం నృత్య రూపకాలకు ఆయన జీవం పోశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...