ఒలింపిక్స్ లో మెరిసిన తెలుగుతేజం

లండన్, జులై 28:  ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ లో శుభారంభం చేశాడు.  మొదటి రౌండ్ లో బెల్జియం ఆటగాడు యుహాన్ తాన్ ను 21-14 21-12 తో ఓడించి రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఈనెల 31న జరిగే రెండో మ్యాచ్ లో వియత్నాం ఆటగాడు టియన్ మిన్హ్ గుయన్ తో కశ్యప్ తలపడతాడు.
ఆర్చరీలో నిరాశ
కాగా, ఆర్చరీలో భారత జట్టు నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన పోటీల్లో జపాన్ జట్టు చేతిలో భారత జట్టు ఓడిపోయింది. జయంత్ తాలూక్ దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్ దీప్ రాయ్ శుక్రవారం జరిగిన రౌండ్ లో 12వ ర్యాంక్ సాధించారు. అయితే, జపాన్ తో జరిగిన పోటీలో శనివారం ఓడిపోయారు. జపాన్ కు చెందిన యూ ఇషిజూ, హిడెకీ కికుచి, తకహరు ఫురుకువా జట్టు భారత్ పై గెలిచింది.
జ్వాలా గుత్తా, దిజు జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ లో కూడా భారత జోడీకి నిరాశే ఎదురైంది. జ్వాలా గుత్తా, దిజు లతో కూడిన భారత జోడీ తొలి రౌండ్ లో ఓటమి పాలైంది. ఇండోనేషియా జోడీ తోంతోవి అహ్మద్, నట్సీర్ చేతిలో జ్వాలా జోడీ వరుస గేమ్స్ లో ఓటమి పాలైంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు