సంగ్మా అభ్యంతరాలకు నో...ప్రణబ్ నామినేషన్ ఓకే...

న్యూఢిల్లీ,జులై 3:  రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి, తన ప్రత్యర్థి ప్రణబ్ ముఖర్జీని నిలువరించాలనే పిఎ సంగ్మా ప్రయత్నం విఫలమైంది. సంగ్మా అభ్యంతరాలను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి  ఆమోద ముద్ర వేశారు. ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌తో పాటు సంగ్మా నామినేషన్‌ను కూడా రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో ఈ నెల 19వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇరువురి మధ్య ముఖాముఖి పోరు ఖాయమైంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వికె అగ్నిహోత్రి రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఐఎస్ఐ చైర్మన్‌గా లాభదాయక పదవిలో కొనసాగుతున్నందున ప్రణబ్ ముఖర్జీ నామినేషన్‌ను తిరస్కరించాలని సంగ్మా రిటర్నింగ్ అధికారి ముందు పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయానికి ప్రణబ్ ఆ పదవిలో కొనసాగుతున్నారని సంగ్మా ఫిర్యాదు చేశారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఎనిమిది రోజుల ముందే జూన్ 20వ తేదీన ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ప్రణబ్ ముఖర్జీ తరఫున చేసిన వాదనను అగ్నిహోత్రి అంగీకరించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు