Friday, July 27, 2012

మా నాన్నే...మా బాబే...

న్యూఢల్లీ,జులై 27: :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్  మాజీ  గవర్నర్ ఎన్ డీ తివారీ- రోహిత్ శేఖర్ తండ్రేనని  ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. తివారీ గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా  ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి  ఆయన గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. డీఎన్ఏ పరీక్షల నివేదిక  బయటపడకుండా తివారీ తీవ్ర ప్రయత్నాలు చేశారు .తన బయోలాజికల్ ఫాదర్‌గా తివారీని ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. చివరకు విజయం సాధించారు. పితృత్వం కేసులో తనపై జరిపిన డిఎన్ఎ పరీక్షల నివేదికను గోప్యంగా ఉంచాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...