కాంగ్రెస్ , ఎన్ సిపి రాజీ

న్యూఢిల్లీ, జులై 25:  కాంగ్రెస్ పార్టీ , ఎన్ సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) మధ్య రాజీ కుదిరింది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో ఎన్ సిపి నేతలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలపై చర్చించారు. శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్ మంత్రి మండలిలో కొనసాగటానికి అంగీకరించారు. సమన్వయ కమిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. దీంతో  వివాదం ముగిసిపోయినట్టు చెబుతున్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు