Tuesday, July 24, 2012

రెండవ వన్ డే లో శ్రీలంక విజయం

హాంబన్ టోట, జులై 24: రెండవ వన్ డే లో  భారత్ పై 9 వికెట్ల తేడాతో శ్రీలంక  ఘనవిజయం సాధించింది.  139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19.5 ఓవర్లకే ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి విజయం సాధించింది. దిల్షన్ 50 పరుగులు చేసి అవుటయ్యాడు. తారంగ్ 59 పరుగులు, చాండిమాల్ 6పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. 5 వన్డేల సిరీస్ లో  రెండు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకొని సమాన స్కోర్ తో ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 33.3 ఓవర్లకు 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.  గంభీర్ 65 పరుగులు, అశ్విన్ 21, సెహ్వాగ్ 15, ధోనీ 11, పఠాన్ 6, ఓఝా 5 పరుగులు చేశారు. ఖాన్ 2 పరుగులు చేయగా, కోహ్లీ, రైనా ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఆర్ జి శర్మ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. పెరీరా, మాథ్యూస్ చెరో మూడ వికెట్లు, మలింగ రెండు, హెరాత్ ఒక వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...