హైదరాబాద్,జులై 22: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం నాడు ఒక రోజు ధర్నానిర్వైంచారు. విజయమ్మ మాట్లాడుతూ, సిరిసిల్లలోని నేతన్నలను ఓదార్చమని జగన్మోహన రెడ్డి చెబితే తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రి అయి సువర్ణ యుగం తీసుకువస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆప్పుడు చేనేత కార్మికుల కోసం జగన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు. . చేనేత వస్త్రాలంటే రాజశేఖర రెడ్డికి ఇష్టం అని చెప్పుకొచ్చారు. చేనేతలకు రాజశేఖర రెడ్డి పెన్షన్ ఇచ్చారని తెలిపారు. ఆప్కో ఆదాయం పెరిగింది రాజశేఖర రెడ్డి హయాంలోనేనని తెలిపారు. సిరిసిల్లలో 5వేల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. టెక్స్ టైల్ పార్కు కోసం ఆయన భూములు కేటాయిస్తే, వాటిని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారని తెలిపారు. నేతన్నలను ఆదుకున్న నేత వైఎస్ఆర్ అని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందన్నారు. ఇలా ఉండగా, విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రాంగణం వద్ద వారు కొద్దిసేపు ఉద్రిక్తత సృష్టించారు. దీక్షను భగ్నం చేసేందుకు టీఆర్ఎస్ సిరిసిల్ల బంద్ కు కూడా పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ ను ముందస్తు అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఎమ్మెల్యే హరీష్ రావును సిద్ధిపేటలో అరెస్టు చేశారు. తూముకుంట వద్ద విజయమ్మ కాన్వాయ్ను అడ్డుకున్న 20 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment