న్యూఢిల్లీ, జులై 24: తమ డిమాండ్లను బుదవారం లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపి కాంగ్రెసు పార్టీని హెచ్చరించింది. యుపిఎ సంకీర్ణం సమన్వయ కమిటీ ఏర్పాటు, భాగస్వామ్య పక్షాలను గౌరవించడం వంటి డిమాండ్లను ఎన్సీపి కాంగ్రెసు ముందు ఉంచింది. ఢిల్లీలో ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటే దాని ప్రభావం మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై కూడా పడుతుందని శరద్ పవార్ సూచనప్రాయంగా చెప్పారు. మహారాష్ట్రలో గత 13 ఏళ్లుగా కాంగ్రెసు, ఎన్సీపి సంకీర్ణం మనుగడలో ఉంది. యుపిఎలోని కాంగ్రెసేతర భాగస్వామ్య పక్షాలు తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఆ పార్టీలతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్సీపి నాయకులు చెబుతున్నారు. శరద్ పవార్ స్థాయి నాయకుడు రెండు మంత్రి వర్గ సమావేశాలకు గైర్హాజరు కావడమనేది బాధ్యత గల తమ పార్టీకి మంచిది కాదని, దాంతో ఉత్కంఠకు తెర దించాలని శరద్ పవార్ భావిస్తున్నారని, అందువల్లనే వరకు తాము గడువు విధించామని ఎన్సీపి నేతలు అంటున్నారు. శరద్ పవార్ తో పాటు ఆ పార్టీకి చెందిన మరో కేంద్ర మంత్రి , ప్రఫుల్ పటేల్ గత వారం మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment