లండన్, జులై 31: హైదరాబాదీ పారుపల్లి కశ్యప్ లండన్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మ్యాచ్లో ఫ్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. గ్రూప్ డిలో జరిగిన రెండో మ్యాచ్లో పదో సీడ్ వియత్నాం ప్లేయర్ గుయెన్పై విజయాన్ని సాధించాడు. స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్లతో గుయెన్ పై 21-9, 21--14 తేడాతో గెలిచాడు. ఈ విజయంతో గ్రూడ్ డిలో తొలి స్దానం సాధించిన ఒలింపిక్ పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు. 25 సంవత్సరాలు వయసు కలిగిన పారుపల్లి కశ్యప్కు ఇది రెండవ విజయం. బెల్జియంకు చెందిన టన్ యుహన్తో జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో కశ్యప్ తన మొదటి గెలుపుని నమోదు చేశాడు.
ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్
మహిళల సింగిల్స్ విభాగంలోహైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించింది. సైనా 21-4, 21-14 తో లియాన్ తాన్ (బెల్జియం) పై విజయం సాధించింది.
జ్వాలా, దిజు అవుట్...
బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాలా, దిజు గ్రూప్ సి లో మూడో మ్యాచ్లోనూ ఓడారు. కొరియా జోడీ డే లీ, హున్ హాతో జరిగిన మూడో మ్యాచ్లో 15-21, 15-21 తేడాతో ఈ జోడీ పరాజయం పాలైంది..
ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్
మహిళల సింగిల్స్ విభాగంలోహైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించింది. సైనా 21-4, 21-14 తో లియాన్ తాన్ (బెల్జియం) పై విజయం సాధించింది.
జ్వాలా, దిజు అవుట్...
బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాలా, దిజు గ్రూప్ సి లో మూడో మ్యాచ్లోనూ ఓడారు. కొరియా జోడీ డే లీ, హున్ హాతో జరిగిన మూడో మ్యాచ్లో 15-21, 15-21 తేడాతో ఈ జోడీ పరాజయం పాలైంది..
No comments:
Post a Comment