Monday, July 16, 2012

డిసెంబర్‌లో భారత్ - పాక్ సిరిస్...?

బెంగుళూరు,,జులై 16:  ఎన్నాళ్ల నుండో భారత్ - పాకిస్తాన్ సిరిస్ కోసం ఎదురు చూస్తున్న క్రీడాభిమానుల ఆశలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ ఏడాది డిసెంబర్‌లో మూడు వన్డే మ్యాచ్‌ల సిరిస్‌ ఆడేందుకు  పాకిస్తాన్ జట్టు  ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. ఐతే ఈ వన్డే సిరిస్‌కు ఇంకా భారత ప్రభుత్వం నుండి అనుమతి లభించాల్సి ఉంది. 2008 లో ముంబై తాజ్ హోటల్‌ పై టెర్రరిస్టుల దాడి అనంతం భారత్ - పాక్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన బోర్డు చర్చలు ఫలించి ఈ సిరిస్‌ను ఆడాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతి లభిస్తే దాదాపు ఐదు సంవత్సరాలు తర్వాత రెండు జట్లు మధ్య మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే అవుతుంది. 2007లో భారత్ - పాకిస్తాన్ మధ్య  సిరీస్ జరిగింది. భారత్ - పాకిస్తాన్‌ మధ్య 2011 లో ప్రపంచ కప్‌లో భాగంగా మొహాలిలో మ్యాచ్ జరిగింది. భారత్‌లో జరిగే నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు ట్వంటీ 20 మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. క్రిస్టమస్ సెలవులలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు డిసెంబర్ 22న  తమ దేశానికి బయలుదేరి జనవరి 3వ తారీఖున తిరిగి ఇండియాకు వస్తుంది.  ఈ మద్య  సమయంలో  భారత్ - పాక్ సిరీస్‌కు బిసిసిఐ  సన్నాహాలు చేస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...