ఒబామా వ్యాఖ్యకు భారత్ స్పందన

న్యూఢిల్లీ,జులై 16:  భారత్ కఠిన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యకు భారత్ తీవ్రంగా స్పందించింది.  తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఉందని, అయితే విధాన నిర్ణయమనేది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తమ ప్రభుత్వ విధానం పెట్టుబడులకు అనుకూలంగానే ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద శర్మ అన్నారు. అమెరికా రక్షణ విధానం నుంచి, వాణిజ్య హద్దుల నుంచి బయటపడాలని ఆయన అన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు