న్యూఢిల్లీ,జులై 14;: తమ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా హమిద్ అన్సారీ పేరును పాలక యూపీఏ ఖరారు చేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ చైర్మన్ గా అన్సారీ సమర్థవంతంగా పనిచేశారని యూపీఏ భాగస్వామ్య పక్షాలు ప్రశంసించాయి.స్వతంత్ర భారతంలో ఉప రాష్ట్రపతిగా వరుసగా రెండో సారి అవకాశం దక్కించుకున్న రెండో వ్యక్తి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ అలిగడ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా పనిచేశారు. ఇంత వరకు తత్వవేత్త, పరిపాలనాదక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ మాత్రమే రెండు సార్లు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. 2007లో యుపిఎ - 1 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్షాలు ఉప రాష్ట్రపతి పదవికి అన్సారీ పేరును సూచించాయి. దానికి కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం అంగీకరించింది. బిజెపి అభ్యర్థి నజ్మా హెప్తుల్లాను ఆయన 455 ఓట్ల తేడాతో ఓడించారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేయడానకి ఈనెల 20 ఆఖరు తేదీ..
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment