బెంగళూరు,జులై 11; రైళ్ళలో ‘ఇన్ఫోటైన్మెంట్’ (ప్రసార మాధ్యమ సౌకర్యం) గా సరికొత్త సీటింగ్, ప్రతి బోగీలో రెండు టీవీలు, డిజిటల్ ఆడియో, జీపీఎస్ విధానం కల్పించబోతున్నారు. ఈ సదుపాయాన్ని ప్రధమంగా నైరుతి రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు-చెన్నై-బెంగళూరు మధ్య నడిచే శతాబ్దిలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటుచేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప, బెంగళూరు నగర రైల్వే స్టేషన్లో మంగళవారం ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే దీనికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల గమ్యస్థానాల వివరాలతో కూడిన డిజిటల్ ఆడియో, వినోదాన్ని పంచేందుకు టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే లాల్బాగ్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హుబ్లి మధ్య నడిచే జన శతాబ్దిల్లోనూ ఈ సౌకర్యాలను అందించడానికి నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment