Wednesday, July 11, 2012

రైళ్ళలో ‘ఇన్ఫోటైన్‌మెంట్’' సౌకర్యం

బెంగళూరు,జులై 11;  రైళ్ళలో  ‘ఇన్ఫోటైన్‌మెంట్’ (ప్రసార మాధ్యమ సౌకర్యం) గా సరికొత్త సీటింగ్, ప్రతి బోగీలో రెండు టీవీలు, డిజిటల్ ఆడియో, జీపీఎస్ విధానం కల్పించబోతున్నారు. ఈ సదుపాయాన్ని ప్రధమంగా నైరుతి రైల్వే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు-చెన్నై-బెంగళూరు మధ్య నడిచే శతాబ్దిలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటుచేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్ప, బెంగళూరు నగర రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే దీనికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల గమ్యస్థానాల వివరాలతో కూడిన డిజిటల్ ఆడియో, వినోదాన్ని పంచేందుకు టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే లాల్‌బాగ్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హుబ్లి మధ్య నడిచే జన శతాబ్దిల్లోనూ ఈ సౌకర్యాలను అందించడానికి నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...