Tuesday, July 10, 2012

రాష్ట్రపతి ఎన్నికలో హైదరాబాదులోనే జగన్ ఓటు ?

హైదరాబాద్,జులై 10;  రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో ఓటు వేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాదులో ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వైయస్ జగన్ ఎన్నిక కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్‌ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని ఆయన సుప్రీంకోర్టును కూడా కోరారు. సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. కేసులో నిందితుడిగా జైలులో ఉన్నప్పటికీ  శానససభ్యుడు లేదా  పార్లమెంటు సభ్యులకు   ఓటును వినియోగించుకునే హక్కు ఉంటుంది. అయితే  జైలులో ఉన్న ప్రజాప్రతినిధి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ వైయస్ జగన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. వైయస్సార్ కాంగ్రెసుకు 17 మంది శానససభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. వీరంతా జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...