Monday, July 9, 2012

పాక్ లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఎయిర్‌ ఇండియా విమానం

122 మంది ప్రయాణికులు క్షేమం
ఇస్లామాబాద్,జులై 9:  ఎయిర్‌ ఇండియా విమానం పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అబుదాబి నుంచి న్యూఢిల్లీ వస్తున్న 'ఎయిర్‌ బస్‌ ఎ 319' అనే విమానం సింధ్‌ ప్రావిన్స్‌లోని నవాబ్‌ షా విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా దిగింది. విమానంలో ఉన్న 122 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. విమానం పాకిస్తాన్ మీదుగా వస్తున్నప్పుడు మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి విఫలం అయ్యాయి. దీంతో పైలెట్‌ సునీల్‌ వశిష్ట్‌ పాక్ లో ల్యాండ్‌ అయ్యేందుకు అక్కడి విమానాశ్రయ అధికారులను అనుమతి కోరారు. అనుమతి వచ్చిన వెంటనే తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాలకు విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఒక విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి విఫలం అరుదుగా చోటు చేసుకునే సాంకేతిక లోపమని నిపుణులు చెబుతున్నారు. పాక్ లో ఉన్న ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఇండియా ఒక విమానాన్ని పంపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...