Sunday, July 8, 2012

ఏడోసారి వింబుల్డన్ ట్రోఫీని సాధించిన ఫెడరర్

లండన్,జులై 8;   స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్  ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో ఏడోసారి గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 4-6, 7-5, 6-3, 6-4తో నాలుగో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఈ విజయంతో ఫెడరర్ ఖాతాలో 17వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ చేరింది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు)... రన్నరప్ ముర్రేకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన ఈ స్విస్ స్టార్ తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. చివరిసారి ఫెడరర్ 2010 జూన్ 6వ తేదీన నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...