
. లండన్,జులై 7: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్లో ఆరో సీడ్ సెరెనా తన కెరీర్లో ఐదోసారి వింబుల్డన్ సింగిల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సెరెనా 6-1, 5-7, 6-2తో మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్స్కా (పోలండ్)పై విజయం సాధించింది. సెరెనాకిది 14వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సెరెనాకు 11 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 9 కోట్ల 86 లక్షలు); రన్నరప్ రద్వాన్స్కాకు 5 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 4 కోట్ల 93 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 30 ఏళ్లు పైబడినా... గాయాలతో ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చినా... యువ క్రీడాకారిణులకు దీటుగా, తనలో ఇంకా పోరాటపటిమ మిగిలి ఉందని... .మరో ‘గ్రాండ్’ విజయంతో సెరెనా చాటిచెప్పింది. కాగా, మిక్సెడ్ డబుల్స్ లో పేస్ (భారత్)-వెస్నినా (రష్యా) జోడి ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో పేస్-వెస్నినా జోడీ 7-5, 3-6, 6-3తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-లీజెల్ హ్యుబెర్ (అమెరికా) జంటను ఓడించింది.
Comments