ఉప రాష్ట్రపతి రేసులో కిశోర్ చంద్రదేవ్ !

 న్యూఢిల్లీ,జులై 4:  ఉప రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆంధ్రకు చెందిన కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేరు వినవస్తోంది. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎన్నికల రేసులో  ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్‌సీ జమీర్ తదితరుల పేర్లు కూదా వినబదుతున్నాయి.  ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా గిరిజనుడిని నిలబెడితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ గిరిజనుడికి మద్దతివ్వలేదని విపక్షాల తరఫు రాష్ట్రపతి అభ్యర్థి పీఏ సంగ్మా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టొచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కాంగ్రెస్ తరపు అభ్యర్థులుగా దళితుడైన సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్‌ల పేర్లూ వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోవడంతో తమ అభ్యర్థిని నిలబెట్టడంపై బీజేపీ అసక్తి కనబరచడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ, కాంగ్రెసేతర పార్టీలు కానీ అభ్యర్థిని నిలబెడితే మద్దతిస్తామని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ తమ అధ్యక్షురాలు సోనియాకు అప్పగించింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు