Tuesday, July 3, 2012

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

న్యూఢిల్లీ,జులై 3: ఎయిర్ ఇండియా పైలట్లు తమ సమ్మెను  విరమించనున్నారు. గత 57 రోజులుగా చేస్తున్న సమ్మెను  ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో తాము వచ్చే 48 గంటల్లో  విరమిస్తామని పైలట్లు చెప్పారు. సమ్మె విరమించాలని ఢిల్లీ హైకోర్టు ఎయిర్ ఇండియా పైలట్లను ఆదేశించింది. తిరిగి పనిలో చేరుతామని పైలట్లు అండర్‌టేకింగ్ ఇచ్చారు. సమ్మె సందర్భంగా తొలగించిన పైలట్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంపై యాజమాన్యం సానుభూతితో వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సమ్మె కాలంలో వివిధ కారణాలతో విధులకు గైర్హాజరైన పైలట్లను యాజమాన్యం ఉద్యోగాల నుంచి తలొగించింది. ఎయిర్ ఇండియాకు చెందిన 434 మంది పైలట్లు కూడా తిరిగి ఉద్యోగం చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. పైలట్ల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్వాసనకు గురైన వంద మంది పైలట్లను, ఇండియన్ పైలట్స్ గిల్డ్డ్‌ నాయకులు పది మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. పైలట్ల 57 రోజుల సమ్మె వల్ల ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...