వాషింగ్టన్,జులై 5: ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులకు ఈ నెల 9న ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏడాది క్రితం అంతర్జాతీయ హ్యాకర్లు వ్యాప్తిచేసిన మాల్వేర్ కారణంగా ప్రపంచ మంతా లక్షలాది కంప్యూటర్లు ఇన్ఫెక్ట్ అయ్యాయి. సోమవారంలోగా ఆ కంప్యూటర్లలోని మాల్వేర్ని తొలగించకపోతే ఇంటర్నెట్ నిలిచిపోయే వీలుంది. .ఒక వేళ మాల్వేర్ని తొలగించకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా నెట్ను తిరిగి పొందినా భవిష్యత్తులో మళ్లీ సమస్య రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్ట్ అయిన 5,70,000 కంప్యూటర్లను నియంత్రణలోకి తీసుకునేందుకుగాను హ్యాకర్లు ఆన్లైన్ ప్రకటనల కుంభకోణాన్ని నడపడంతో సమస్య మొదలైంది. అయితే హ్యాకర్లను అణచేయడానికి ఎఫ్బీఐ ప్రయత్నించినా, ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్లను నియంత్రించేందుకు ఉపయోగించిన దోషపూరిత సర్వర్లను నిలిపేస్తే బాధితులందరూ ఇంటర్నెట్ సేవలను కోల్పోతారు. దీంతో ఎఫ్బీఐ ప్రత్యేకంగా ఒక సేఫ్టీనెట్ను ఏర్పాటుచేశారు. తాత్కాలికంగా రెండు కొత్త ఇంటర్నెట్ సర్వర్లనూ ప్రారంభించారు. అయితే ఈ తాత్కాలిక సర్వర్ల కాల పరిమితి ఈ నెల 9న ముగియనుండటంతో మళ్లీ సమస్య ఏర్పడింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment