Sunday, July 15, 2012

నేపాల్ లో రోడ్డు ప్రమాదం: 36 మంది మృతి

ఖాట్మండ్,జులై 15:  నేపాల్ లో జరిగిన  రోడ్డు ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 70 నుంచి 80 మంది  ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు దక్షిణ నేపాల్ లోని ఒక కాలువలో బోల్తాపడింది.   వారిలో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్ కు చెందినవారు . వీరందరూ త్రివేణీ ఘాట్ లో జరిగే బోల్ బామ్ లో జరిగే ఉత్సవాలకు  వెళుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 25 మంది పురుషు ల, పది మంది మహిళల, ఒక బాలుడి మృత దేహాన్ని వెలికి తీశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...