మృతులలో హైదరాబాద్ యువతి
నెల్లూరు,జులై 30: న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు కనీసం 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈ రైలు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ప్రయాణికులంతా దాదాపు తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. ఒక మృత దేఅన్ని హైదరాబాద్లోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతిగా గుర్తించారు. చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలి ఎంగేజ్మెంట్ కోసం కరీంనగర్ వచ్చింది. శాలిని వరంగల్ లో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కింది. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీశారు.
నెల్లూరు,జులై 30: న్యూఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు కనీసం 30 మంది ప్రయాణికులు మృతి చెందారు. శనివారం రాత్రి న్యూఢిల్లీ బయల్దేరిన ఈ రైలు తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఎస్ -10, ఎస్ -11 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. ప్రయాణికులంతా దాదాపు తమిళనాడుకు చెందిన వారిగానే భావిస్తున్నారు. ఒక మృత దేఅన్ని హైదరాబాద్లోని కాప్రాకు చెందిన శాలిని అనే యువతిగా గుర్తించారు. చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలి ఎంగేజ్మెంట్ కోసం కరీంనగర్ వచ్చింది. శాలిని వరంగల్ లో తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కింది. అగ్ని ప్రమాదానికి గురైన బోగి... ఆనవాళ్లు లేకుండా మారిపోయింది. బెర్తులన్నీ బూడిద కుప్పలుగా మారాయి. శవాల్ని అతికష్టమ్మీద బయటకు తీశారు.
No comments:
Post a Comment