విజయవాడ,జులై 30: కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి కైకలూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వేయి రూపాయల జరిమానా విధించింది. మృతదేహం తో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు నానిని దోషిగా కోర్టు నిర్ధారించి, శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో నానికి 353 సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష, 426 సెక్షన్ కింద వేయి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అప్పీల్ కోసం నానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. నాని 2005లో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. గుడివాడ శాసనసభా నియోజకవర్గంలో మోషి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తనకు అందడం లేదని ఆరోపిస్తూ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు అతని శవంతో నాని వందలాది మందితో ధర్నా చేశాడు. ధర్నా రోజంతా సాగింది. నాని ధర్నాపై అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. సాక్షులను విచారించిన తర్వాత కోర్టు సోమవారం ఈ కేసులో తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ నంచి గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు వైయస్ జగన్ను కలిశారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తరఫున గుడివాడ నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment