13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ప్రమాణ స్వీకారం

 న్యూఢిల్లీ, జులై 25: భారత 13 వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు.  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కపాడియా ప్రణబ్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోకసభ స్పీకర్ మీరా కుమార్, ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రతిభా పాటిల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... రాష్ట్రపతిగా దేశానికి తన సేవలు అందిస్తానని, దేశాభివృద్ధి కోసం, దేశ ఆర్థిక రంగాన్ని మెరుగు పర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. భారత్ తన భవిష్యత్తు లక్ష్యాలను విద్యాభివృద్ధితోనే సాధించగల్గుతుందని చెప్పారు. అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రుత్వానికి నూకలు చెల్లుతున్నాయని, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందన్నారు. భారతీయులు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలరన్నారు. ప్రపంచ ఆధునీకరణకు మన దేశం ఓ నమూనా అన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నూతన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ప్రణబ్ పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు