అవును...సమయమొచ్చింది...

 తెలంగాణా నిర్ణయంపై చిదంబరం 
న్యూఢిల్లీ ,జూన్ 29:   తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం శుక్రవారం చెప్పారు.  తెలంగాణపై  వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.  కానీ ఖచ్చితమైన టైమ్ లిమిట్ మాత్రం ఏదీ లేదని చెప్పారు.. తనను కలిసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. తనను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  కాంగ్రెసు పార్టీతో పాటు నిర్ణయం చెప్పని మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు