ఎడ్డీ వర్గం మంత్రుల రాజీనామా...

సంక్షేభంలో కర్ణాటకం... 
బెంగళూరు,జూన్ 29: మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మద్దతుదారులు ఎనిమిది మంది మంత్రుల రాజీనామాతో కర్నాటక ప్రభుత్వం తాజాగా సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడను పదవి నుంచి వెంటనే తొలగించాలని రాజీనామా సమర్పించిన మంత్రులు బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. హై కమాండ్ నిర్ణయం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశామని.. ఇక ఎక్కువ కాలం వేచి చూసే అవకాశం లేదని.. అందుకే రాజీనామా సమర్పించామని వారు మీడియాతో అన్నారు. ఎనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను సమర్పించామని మంత్రి సీఎం ఉదాసీ తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు