Friday, June 29, 2012

ఎడ్డీ వర్గం మంత్రుల రాజీనామా...

సంక్షేభంలో కర్ణాటకం... 
బెంగళూరు,జూన్ 29: మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మద్దతుదారులు ఎనిమిది మంది మంత్రుల రాజీనామాతో కర్నాటక ప్రభుత్వం తాజాగా సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడను పదవి నుంచి వెంటనే తొలగించాలని రాజీనామా సమర్పించిన మంత్రులు బీజేపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. హై కమాండ్ నిర్ణయం కోసం ఇన్నాళ్లు ఎదురు చూశామని.. ఇక ఎక్కువ కాలం వేచి చూసే అవకాశం లేదని.. అందుకే రాజీనామా సమర్పించామని వారు మీడియాతో అన్నారు. ఎనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను సమర్పించామని మంత్రి సీఎం ఉదాసీ తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...