వైభవంగా రామ్ చరణ్ , ఉపసానల పెళ్ళి
హైదరాబాద్ జూన్ 14; సినిమా సెట్టింగ్ ను తలపించే వేదికపై, వేల సంఖ్యలో అతిధుల సమక్షంలో టప్రముఖ యువహీరో రామ్ చరణ్ తేజ, ఉపసానల వివాహం గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని టెంపుల్ ట్రీ ఫామ్ హౌస్ ఈ వేడుకకు వేదిక అయ్యింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ దంపతులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు . వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్ కళ్యాణ్, బన్నీల హడావుడి కనిపించింది. పెళ్లికి రెండుమూడ్రోజుల ముందు నుంచే రోజుకో కార్యక్రమాన్ని చేపట్టిన వధూవరుల కుటుంబాలు ... పెళ్లిని కూడా కనివినీ ఎరగని రీతిలో జరిపించాయి. పెళ్లి మండపం వద్ద టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినీ తారల సందడి కనిపించింది.

Comments