Monday, June 11, 2012

నిత్యానంద స్వామి గల్లంతు...

చెన్నై, జూన్ 11:  సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న నిత్యానంద స్వామీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. బెంగళూరు సమీపంలోని బిడది ధ్యానపీఠం ఆశ్రమంలో సోదాలు నిర్వహించి, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బిడది ఆశ్రమం స్వాధీనంతో పాటు సెక్స్ స్కాంలో నిత్యానంద పొందిన బెయిల్ పిటిషన్ రద్దుకు హోంశాఖ ప్రయత్నాలు చేస్తోంది. నిత్యానంద స్వామి ఘటనపై కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సదానంద గౌడ సీరియస్ అయ్యారు. రెండు రోజుల్లో నిత్యానందను అరెస్టు చేస్తామని చెప్పారు. నిత్యానంద పరారీ నేపథ్యంలో బిడదిలోని ఆయన ఆశ్రమానికి తాళాలు వేయాలని ఆదేశించారు. ఆయనపై దర్యాఫ్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమంలో ఏఏ వస్తువులు ఉన్నాయో ఆరా తీయాలని సూచించింది. నిత్యానంద స్వామి అమాయక మహిళల పై అత్యాచారం చేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.  వారం రోజుల క్రితం ఓ నటి తనను నిత్యానంద బలవంతంగా రేప్ చేశారని ఆరోపించింది. ఆమెను నిత్యానంద దాదాపు పలుమార్లు రేప్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఆరోపణలు ఖండించేందుకు నిత్యానంద నాలుగు రోజుల క్రితం బిడది ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో నిత్యానందకు కోపం వచ్చింది. తన అనుచరులతో రిపోర్టర్‌ను . బయటకు గెంటివేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత విలేకరులు ఆందోళనకు దిగారు. రిపోర్టర్ పైన దాడి కేసులో నిత్యానందతో పాటు ఆయన శిష్యుల పైన కేసు నమోదయింది. పోలీసులు అశ్రమంలోని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. శిష్యులను అరెస్టు చేయడంతో నిత్యానంద అదృశ్యమయ్యాడు. నాలుగు రోజులుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు.  పలు ప్రాంతాలలో ఆయన కోసం పోలీసులు గాలించారు. కాని నిత్యానంద ఆచూకి మాత్రం లభించలేదు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...