వాషింగ్టన్ ,జూన్ 23: 2006 లో ఏకంగా ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపి 2006 లో ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న భారత-అమెరికన్ సునీతావిలియమ్స్. మరోసారి అంతరిక్షానికి పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే జూలై 14న మొదలవనున్న ఈ యాత్రకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయని నాసా తెలిపింది. ఈ యాత్రలో భాగంగా సునీత ఫ్లైట్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారని నాసా పేర్కొంది. మరికొంత మంది తోటి ఫ్లైట్ ఇంజినీర్లతో ఆమె రెండు సార్లు స్పేస్ వాక్ చేయనున్నారని తెలిపింది. కల్పనాచావ్లా తరువాత అంతరిక్షయానానికి నాసా ఎంపిక చేసిన భారత సంతతికి చెందిన
రెండో మహిళ సునీతా విలియమ్స్. అంతరిక్షయానం చేసిన మహిళలకు సంబంధించి ఆమె
మూడు రికార్డులను కలిగి ఉన్నారు. అత్యధికంగా 195 రోజులపాటు యాత్రలో
పాల్గొనడం, నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయడం, 29 గంటల 17 నిముషాల పాటు
స్పేస్ వాక్ లో పాల్గొనడం ఆమె సాధించిన ఘనత. అమెరికా నావల్
అకాడమీ నుంచి 1987లో పట్టభద్రురాలైన సునీత.. 1998లో ఆస్ట్రొనాట్ గా నాసా
తరఫున ఎంపికయ్యారు. ఈ మధ్య కాలంలో అమెరికా నావీ అధికారిగా వివిధ విభాగాల్లో
సేవలు అందించారు. ఆమె ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ నుంచి 1995లో మాస్టర్స్
డిగ్రీ అందుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment