హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పినాకీ చంద్రఘోష్ ప్రమాణం
హైదరాబాద్ ,జూన్ 25; రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం ఆయన చేత ప్రమాణం చేయించారు. చంద్రఘోష్ అంతకుముందు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ మదన్ లోకూర్ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకీ చంద్రఘోష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులు, ప్రముఖులు హాజరయ్యారు.
Comments