రుతుపవనాల మందగమనం

విశాఖపట్నం,జూన్ 23:  రాష్ట్రంలో వర్షపాతం పెరిగేందుకు సహకరించే అల్పపీడన ద్రోణి  మధ్య భారతం వైపు తరలి పోతుండడంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలక ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనుకున్నంత స్థాయిలో వర్షం కురవలేదు. అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నా అవి రుతుపవనాల ప్రభావం వల్ల కాదని, ద్రోణి కారణంగానే పడుతున్నాయని భావించారు. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వచ్చే అవకాశం ఉందన్నారు. అది కూడా గోవా వైపు మళ్లింది.  ప్రస్తుతం నైరుతి రుతుపవనాల్లో కదలిక లేదు.  అయితే ఇవన్నీ సాధారణమేనని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగినా ఆందోళన చెందనక్కర్లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. రుతుపవనాల్లో కదలిక వస్తేనే వర్షాలొస్తాయని చెప్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు