చిరంజీవికి నాన్ బెయిలబుల్ వారెంట్
చెన్నై,జూన్ 20: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి తమిళనాడు హోసూర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2011 తమిళనాడు ఎన్నికల్లో పరిమితికి మించి వాహనాలు వాడారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం గత నెల 7వ తేదీన చిరంజీవి కోర్టు హాజరు కావల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీలోపు చిరంజీవి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
Comments