చిరంజీవికి నాన్ బెయిలబుల్ వారెంట్

 చెన్నై,జూన్ 20: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవికి తమిళనాడు హోసూర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2011 తమిళనాడు ఎన్నికల్లో పరిమితికి మించి వాహనాలు వాడారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నిమిత్తం గత నెల 7వ తేదీన చిరంజీవి కోర్టు హాజరు కావల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాకపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్ 2వ తేదీలోపు చిరంజీవి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు