న్యూఢిల్లీ,జూన్ 18: రాష్ట్రపతిగా మరోసారి పోటీ చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తేల్చి చెప్పారు. తాను పోటీ చేసే ప్రసక్తి లేదని అబ్దుల్ కలాం భారతీయ జనతా పార్టీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీకి ఫోన్ ద్వారా తెలిపారు. తనకు మద్దతు ఇస్తున్న అద్వానీ, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు రెండోసారి రాష్ట్రపతి కావాలన్న ఆశ లేదని ఆయన అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అబ్దుల్ కలాంపై తృణమూల్, బిజెపిలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారి అన్నారు. ఆంధ్రఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment