మరోసారి....! సారీ...కలాం

న్యూఢిల్లీ,జూన్ 18: రాష్ట్రపతిగా మరోసారి పోటీ చేసేందుకు తన అంతరాత్మ  అంగీకరించడం లేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తేల్చి చెప్పారు. తాను పోటీ చేసే ప్రసక్తి లేదని అబ్దుల్ కలాం భారతీయ జనతా పార్టీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీకి ఫోన్ ద్వారా తెలిపారు. తనకు మద్దతు ఇస్తున్న అద్వానీ, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు రెండోసారి రాష్ట్రపతి కావాలన్న ఆశ లేదని ఆయన  అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు అబ్దుల్ కలాంపై తృణమూల్, బిజెపిలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆయన ఈ  ప్రకటన చేశారు. కాగా, రాష్ట్రపతి పదవికి పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్‌ తివారి అన్నారు.  ఆంధ్రఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు