Tuesday, June 26, 2012

మన్మోహన్ చేతిలోనే ఫైనాన్స్...

న్యూఢిల్లీ,,జూన్ 26:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ కూటమి అభ్యర్థిగా ఎంపికైన ప్రణబ్ ముఖర్జీ రాజీనామా సమర్పించడంతో అయన నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖను తన వద్దే ఉంచుకోవాలని దేప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు.  కాగ,  ఆర్ధిక శాఖ సహాయమంత్రులుగా  ఎస్‌ఎస్ పలనిమనిక్కమ్, నామో నారాయణ మీనా కొనసాగుతారు. 1991 సంవత్సరంలో పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆర్ధిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ కేంద్ర ఆర్ధికమంత్రిగా పలు ఆర్ధిక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధిక వృద్ధి రేటు 6.5 శాతానికి పతనమై.. తొమ్మిదేళ్ల కనిష్టస్థాయికి చేరుకోవడం.. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 57.97 స్థాయిని నమోదు చేసి చారిత్రక కనిష్టానికి చేరుకోవడంతో  ఒక సవాల్ గా మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిత్వ శాఖను తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...