ఇండోనేసియా ఓపెన్ విజేత 'సైనా
జకార్తా, జూన్ 17: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ జురుయ్ లీ (చైనా)ను 13-21, 22-20, 21-19 తేడాతో ఓడించింది. సైనా 2009, 2010లోనూ ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఇండోనేసియా టైటిల్స్ గెల్చుకోవడం ద్వారా సైనా నెహ్వాల్ సత్తా చాటింది.

Comments