Monday, June 11, 2012

జగన్ కు నార్కో టెస్ట్ లపై 14న విచారణ...

హైదరాబాద్, జూన్ 11:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నార్కో టెస్టులకు అనుమతించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైయస్ జగన్ తమ విచారణలో పెదవి విప్పడం లేదని, పూర్తి వివరాలు తెలియజేయడం లేదని కాబట్టి నార్కో టెస్టులకు అనుమతించాలని కోర్టును సిబిఐ కోరింది. అయితే, దీనికి  జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నార్కో టెస్టులు సైంటిఫిక్‌గా రుజువు కాలేదని చెప్పారు. నార్కో టెస్టులకు అనుమతి కోరడం ద్వారా సిబిఐ సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తోందని జగన్ తరఫు న్యాయవాదులు అన్నారు. కోర్టు ఇరువురి వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను 14వ తేదికి వాయిదా వేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...