Monday, May 28, 2012

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు ఇక కామన్ ఎంట్రన్స్...

ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ  
న్యూఢిల్లీ,  మే 28: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే ఇంజనీరింగ్ విద్యా సంస్థలకు 2013 విద్యా సంవత్సరం  నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల పాలక మండళ్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి పరిధిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని తీర్మానించారు. అదే సమయంలో 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పరీక్షలను కూడా ప్రవేశార్హతలో పరిగణనలోకి తీసుకోవాలని.. ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో భాగంగా మెయిన్ టెస్ట్, అడ్వాన్స్ డ్  టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ రెండు టెస్టులూ ఒకే రోజు జరుగుతాయి. మెయిన్ టెస్టులో అత్యధిక మార్కులు సాధించిన 50,000 మందికి చెందిన అడ్వాన్స్ టెస్ట్ పేపర్లను మూల్యాంకనం చేసి.. మెరిట్ ప్రాతిపదికన ఐఐటీ ప్రవేశాలకు ర్యాంకులు ఇస్తారు. ఐఐటీలు మినహా ఇతర కాలేజీలకు.. బోర్డు పరీక్షల మార్కులకు 40 శాతం, మెయిన్ టెస్టుకు 30 శాతం, అడ్వాన్స్ టెస్ట్ కు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. మెయిన్ టెస్ట్ కు మల్టిపుల్ చాయిస్ పేపర్ ఉంటుందని, అడ్వాన్స్ డ్  టెస్ట్ విధివిధానాలను ఐఐటీల జాయింట్ అడ్మిషన్ బోర్డు రూపొందిస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం, మెరిట్ లిస్టుల తయారీ వంటి అంశాల్లో జేఏబీకి పూర్తి నియంత్రణ ఉంటుందని, ఈ పరీక్షల నిర్వహణకు సీబీఎస్‌ఈ పాలనాపరమైన సహాయాన్ని అందిస్తుందని కపిల్ సిబల్  వివరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...