హైదరాబాద్, మే 31: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెసేతర పార్టీలు చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు. నగరంలో కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం పెద్దగా లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అయితే ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైకి, రైలు పట్టాల పైకి వచ్చి వాహనాలను, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment