లండన్ ,మే 20: అత్యంత వేగంతో, అత్యధిక సామర్థ్యంతో పనిచేసే ఓ సరికొత్త కంప్యూటర్ చిప్ను తాము తయారుచేశామని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘మెమ్రిస్టర్’ అని నామకరణం చేసిన ఈ చిప్కు మెమరీ సామర్థ్యం కూడా అధికంగా ఉంటుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల తయారీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనిని అభివృద్ధిపర్చామని, దీని ధర కూడా చౌకగానే ఉంటుందని పరిశోధన బృందం నాయకుడు ఆంథోనీ కెన్యన్ తెలిపారు. చిప్లోకి ఎంత విద్యుత్ వస్తోందన్న దాన్ని బట్టి దాని నిరోధక శక్తి మారుతూ ఉంటుందన్నారు. ప్రస్తుతం దీనిని వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తొలి రకం మెమ్రిస్టర్ డిజైన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు హెవ్లెట్-ప్యాకార్డ్ కంపెనీ కూడా సన్నాహాలు చేస్తోందని తెలిపారు. అయితే సిలి కాన్ మెమ్రిస్టర్లను ఇదివరకే కొందరు తయారుచేసినా, అవి సున్నితంగా ఉన్నాయని తాము కొత్త విధానంలో తయారుచేసిన సిలికాన్ మెమ్రిస్టర్లు వాటి కన్నా సమర్థంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment